శ్లోకం: సువర్ణధారా స్తోత్రం యత్
శంకరాచార్య నిర్మితం
త్రి సంధ్యం యః పఠేన్నిత్యం
సకుబేర సమోభవేత్
పద్యం: కనక ధారాస్తవము దీని కరుణతోడ
శంకర భగవత్పాదులు సంతరించి
నారు, నిత్యము మూడు సంధ్యలను చదువు
భక్తులు కుబేరు సామ్యము బడయగలరు.
అర్థం: మహర్షి శంకరభగవత్పాదులు ఈ స్తవమును సంస్కృతమున రచియించిరి. వారి అనుగ్రహమున ప్రతి దినము మూడు సంధ్యల పఠించు భక్తుడు కుబేరునితో సమానము కాగలడు.
ఆంగ్లం: IN SANKRIT WROTE THE LORD
SANKAR BY NAME, OUR BARD
I WRITE AND CRAVE HIS GUARD
FOR ALL MY FAULTS TO PARD'N
BY NAME I CARRY NO QUALITY (NIRGUNA)
IT IS TO YOU TO KNOW THE QUALITY.

No comments:
Post a Comment